కెన్యాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 165 మందికి గాయాలు
కెన్యాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 165 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.
దీంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో 165 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
భారీగా మంటలు చెలరేగడంతో స్పాట్ లో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. కంపెనీకి చెందిన రెండు బిల్డింగ్ లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడినవారికి స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాయు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.