జయహో భారత్.. ఇస్రోకు జేజేలు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ లాండింగ్ అయిన తొలి దేశంగా చరిత్రకెక్కిన భారత్.
చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ విజయవంతమైంది. నిన్న సాయంత్రం 5:44 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, చైనా, సోవియట్ తర్వాత చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.