Andhra PradeshFACTSHealthNews

నిరుద్యోగులకు ఏపీపీఎస్‌సీ అలెర్ట్..

నిరుద్యోగులకు ఏపీపీఎస్‌సీ అలెర్ట్..

గ్రూపు-2 పరీక్షపై అధికారిక ప్రకటన..

నిరుద్యోగులను ఏపీపీఎస్‌సీ అప్రమత్తం చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్షపై అధికారిక ప్రకటన చేసింది. ఎగ్జామ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది.

షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించస్తామని ప్రకటించింది. దీంతో ఈ నెల 25వ తేదీనే ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

అభ్యర్థులు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని.. పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది. సిలబస్ వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

కాగా, మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీలైనన్నీ భర్తీ చేయాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *