GeneralLatestLive TVNews

అయోధ్య రాముడి నుదుటిపై సూర్యతిలకం

Ayodhya:శ్రీరామనవమి వేళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఉన్న బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’ ప్రసరించింది. దీన్ని చూసి యావత్ దేశంలోని భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిపై తిలకంలా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించడాన్ని అందరూ ఆసక్తిగా వీక్షించారు. Ayodhya శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *